
ఆశ్రయము
సాయిబాబా మందిరం భక్తుల హృదయాలకు శరణు, ధైర్యానికి ఆధారం, భయాలకు ఓ ఆసరా.

అనుగ్రహము
ఆయన ఆశీస్సులు జీవితాన్ని మారుస్తాయి; నమ్మకంతో ప్రార్థించిన ప్రతి మనసుకు ఆయన కరుణ లభిస్తుంది.

ఆత్మశాంతి
ఈ మందిరం వాతావరణం మనసును ప్రశాంతంగా చేస్తుంది, ఆత్మకు ఓ నిశ్శబ్ద ఆనందాన్ని ప్రసాదిస్తుంది.



ప్రత్యేక పూజలు మరియు అన్నదాన సేవ
ప్రతి ఉదయం 6 గం|| లకు కాకడ హారతి అనంతరం బాబా వారికి మంగళ స్నానం, అభిషేకం జరుగును. అనంతరం భక్తుల గోత్రనాలతో నిత్య అర్చన జరుగును . గురువారం అన్నసమారాధన జరుగును.

శ్రద్ధా మరియు సబూరితో, సాయిబాబా ఆశీస్సులను పొందండి
శ్రద్ధా అంటే భగవంతుడిపై నమ్మకం. సబూరి అంటే ఓర్పు.
ఇవి సాయిబాబా జీవన సారాంశం. ఈ తత్వాలను అనుసరించడం ద్వారా భక్తులు మనశ్శాంతిని పొందగలరు.
ఇక్కడ ప్రతిరోజూ సాయిబాబా ప్రవచనాలు, కధనాలు పఠించబడతాయి – భక్తుల ఆత్మకి ఆహారంగా.
నా భక్తుల బాధను నేను భరించలేను
నన్ను పిలుస్తే నేను వస్తాను
పూజలు మరియు కార్యక్రమాలు
06:00 AM
ప్రతి రోజు
ఉదయం
కాకడ హారతి
12:00 PM
ప్రతి రోజు
మధ్యాహ్నం
మధ్యాహ్న హారతి
06:00PM
ప్రతి రోజు
సాయంత్రం
సంధ్య హారతి
08:30PM
ప్రతి రోజు
రాత్రి
శేజ్ హారతి
05:30 AM
గురువారం
ఉదయం
కాకడ హారతి
12:30 PM
గురువారం
మధ్యాహ్నం
మధ్యాహ్న హారతి
05:30 PM
గురువారం
సాయంత్రం
సహస్ర దీపాలంకరణ సేవ
06:15 PM
గురువారం
సాయంత్రం
సంధ్య హారతి
07:00 PM
గురువారం
రాత్రి
పల్లకీ సేవ
09:00 PM
గురువారం
రాత్రి
శేజ్ హారతి
మా దేవాలయం – భక్తి, విశ్వాసం, ఓర్పుకు నిలయం
ఈ దేవాలయం స్థాపన నల్లపాటి వెంకటేశ్వర రావు గారు మరియు వారి కుటుంబ సభ్యుల గొప్ప భక్తి, నిస్వార్థ సేవా భావంతో జరిగింది. బాబా పట్ల వారి అసిమ భక్తి ఈ మందిరాన్ని నిర్మించేందుకు ప్రేరణగా నిలిచింది.
సాయిబాబా ఉపదేశమైన “శ్రద్ధా” (విశ్వాసం) మరియు “సబూరి” (ఓర్పు) అనే మార్గదర్శక తత్వాలను అనుసరించి, ఈ దేవాలయం భక్తుల ఆధ్యాత్మిక జీవనంలో వెలుగును నింపుతోంది.
ప్రతి రోజూ మంత్రోచ్ఛారణలతో, పూజా కార్యక్రమాలతో, మరియు సాంప్రదాయాల పరిరక్షణతో ఈ మందిరం భక్తులకు ఒక పవిత్రమైన అనుభూతిని కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రతి గురువారం మరియు పౌర్ణమి రోజుల్లో జరిగే ప్రత్యేక కార్యక్రమాలు భక్తులను ఆకర్షిస్తాయి.
ఈ మందిరం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కాకుండా, సామూహిక సేవా కార్యక్రమాలకు కేంద్రబిందువుగా కూడా పనిచేస్తోంది.